అధికారుల మంత్రి జగదీశ్ | సూర్యపేట: సూర్యపేట జిల్లాను బహిరంగ విసర్జన రహిత జిల్లాగా రూపుదిద్దుకునేలా ప్రకటించడం తో పాటు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు శ్రద్ద చూపించాలని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. హరితహారంపై సూర్యపేట జిల్లా కేంద్రంలోనీ బాలాజీ ఫంక్షన్ హాల్లో ఈ అంశంపై జిల్లా అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్ జిల్లా ప్రజాపరిషత్ చేయిర్మన్ గుజ్జ దీపికా యూగందర్ రావు జిల్లా గ్రంథాలయ సంస్థ చేయిర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ ,జిల్లా ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ సూర్యపేట జిల్లా డిఆర్ డిఓపిడి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యపేట జిల్లాను మల విసర్జన రహిత జిల్లాగా రూపు దిద్దడంలో అధికారుల పాత్ర కీలకమని ఆయన గుర్తు చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో చేసే ప్రతి పనిలో పురోగతిని సాధించవచ్చని ఆయన ఉపదేశించారు. హరితహారం విజయవంతం చేయడంలో గ్రామ కార్యదర్శుల సింహ భాగంలో ఉండాలని ఆయన కోరారు. 2014కు పూర్వము చెట్ల పెంప కం అనేది కాగితాలతో సరిపెట్టారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతకాలం అంకెల గారడితో జరిగిన మోసాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారంలో నిర్దేశించిన ప్రతి మొక్క భూమి మీద నాటేలా చర్యలు చేపట్టారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చెట్ల నాటడం అనేది ప్రజల భాగస్వామ్యం తో ఒక ఉద్యమం లా కొనసాగిస్తున్న విషయాన్ని - ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. హరితహారం మొదలు
పెట్టకముందు కాగితాల మీదనే అడవులు సృష్టించిన అంశాన్ని గణాంక వివరాలతో ఆయన బయట పెట్టారు. అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా అని అందులో సూర్యపేట జిల్లా చెట్ల పెంపకంలో మరింత వెనకబడి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి సూర్యపేట జిల్లా 12 వేల హెక్టార్ల భువిస్తీర్ణాలో 33% భూమి అటవీ ప్రాంతంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. అటువంటిది లెక్కల్లో కేవలం 2.4%మా త్రమే అటవీ ప్రాంతం ఉన్నట్లు లెక్కల్లో చూపుతున్నారు అంటే చెట్ల పెంపకం లో మనం ఎక్కడ ఉన్నామో ఒక్కసారి అవలోకనం చేసుకోవాలని ఆయన ఉపదేశిం చారు. ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో అడవుల్లో ఉండే కోతులు జనావాసాలకు వస్తున్న అంశాన్ని విస్మరించరాదని ఆయన కోరారు.కేవలం ప్రభుత్వ భూములలో మాత్రమేకాకుండా ప్రతి ఒక్కరూ తమ తమ వ్యవసాయ భూములలో కూడావిరివిగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపు నిచ్చారు. అందుకు భిన్నంగా వ్యహరిస్తే 2070 నాటికీభారతదేశ పరిస్థితి అగమ్యగోచరం గా మారుతుందన్న దివంగత రాషపతి అబుల్ కలాం మాటలు ఇక్కడ ప్రస్తవాన ఝామేనంటూ ఆయన ఉపదేశించారు.