కోరుట్ల మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకుడు

కోరుట్ల మున్సిపాలిటీ పై బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్  శీలం వేణు గోపాల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ టైగర్ అలీ నవాబ్ తో  ఇంటర్వ్యూలో మాట్లాడారు. కోరుట్ల మున్సిపల్ 33 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను నిలిపి అధిక సీట్లు గెలుచుకుని చైర్మన్ కైవసం చేసుకుంటాం అన్నారు.బీజేపీ పార్టీ అన్ని కుల, మతాల, అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు  ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.